ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ఘనంగా  అంతర్జాతీయ మహిళా దినోత్సవం

మల్కాపూర్ గురు మండలం - వరంగల్లు గురుపీఠం

 వరంగల్లు మేత్రాసనం, పునీత అల్ఫోన్స్ మరియ లిగోరి గారి దేవాలయం, మల్కాపూర్ గ్రామము లో  అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మల్కాపూర్ విచారణలో గురుశ్రీ పూదోట దాసయ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలందరూ ఉత్సాహముతో పాల్గొన్నారు.

ఉదయం 10.00 గం.లకు పరిశుద్ధ దివ్యబలిపూజ నిర్వహించారు. గురుశ్రీ  తానుగుండ్ల జెరోము గారు, గురుశ్రీ  సింగారెడ్డి బాలశౌరి గారు, గురుశ్రీ  పూదోట దాసయ్య గారు ఈ దివ్యపూజాబలిని సమర్పించారు. అనంతరం మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో  విశిష్ట అతిధులుగా  శ్రీమతి దొడ్డ లతా గారు (బాలవికాస మహిళ కార్యక్రమాల సారథి) మరియు శ్రీమతి సెలీనా గారు (వరంగల్లు గురుపీఠ మహిళా కమిషన్ అద్యక్షులు) పాల్గొన్నారు.

మధ్యాహ్నం 01.00 గం.లకు ప్రేమ విందుని  గురుశ్రీ పూదోట దాసయ్య గారు ఏర్పాటు చేసారు. అనంతరం ఆటలపోటీలు,వినోద కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.      
 
గురుశ్రీ  పూదోట దాసయ్య గారు మాట్లాడుతూ "మహిళలు ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ, అన్ని రంగాలలో అభివృద్ధి చెందుటకు, ఉన్నత ఆశయాల అవకాశాలను సృష్టించుకోవాలి అని   అన్నారు. కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.  

 

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer

 

 

Telugu Survey Popup Image