వైభవంగా జరిగిన గుణదల లూర్దుమాత మహోత్సవాలు

గుణదల లూర్దుమాత మహోత్సవాలు

వైభవంగా జరిగిన గుణదల లూర్దుమాత మహోత్సవాలు 

విజయవాడ మేత్రాసనం గుణదల లూర్దుమాత మహోత్సవాలు ఫిభ్రవరి 9 నుండి ఫిబ్రవరి 11 వరకు ఘనంగా జరిగాయి. 

ఈ 102 వ వార్షిక మహోత్సవాన్ని ఫిబ్రవరి 9 న విజయవాడ మేత్రాసన పీఠకాపరి మహా పూజ్య తెలగతోటి రాజారావు గారు జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభించారు.  

అనంతరం జరిగిన దివ్యబలిపూజను 25 వసంతాల గురుజీవిత రజత జూబిలీ జరుపుకుంటున్న గురుశ్రీ నెల్టూరి ఫ్రాన్సిస్ గారు, గురుశ్రీ మద్దాల జోసఫ్ గారు ఇతర గురువులతో కలిసి సమిష్టిగా సమర్పించారు.

ఫిబ్రవరి 9 న సాయంత్రం 6 గంటలకు కడప మేత్రాసన పీఠకాపరి మహా పూజ్య సగినాల పాల్ ప్రకాష్ గారు ఇతర గురువులతో కలిసి సమిష్టి దివ్యబలిపూజను సమర్పించారు.

ఆయన మరియతల్లి యొక్క గొప్పతనాన్ని గూర్చి, విశిష్టతను గూర్చి విశ్వాసులకు తన సందేశంలో వివరించారు.

ఫిబ్రవరి 10 న నెల్లూరు మేత్రాసన సహవారస పీఠకాపరి మహా పూజ్య పిల్లి అంతోని దాస్ గారు ప్రధాన అర్చకులుగా మహా పూజ్య రాజారావు గారు మరియు ఇతర గురువులతో కలిసి సమిష్టి దివ్యబలిపూజను సమర్పించారు.

ఫిబ్రవరి 10 సాయంత్రం, విశాఖ అతిమేత్రాసన పీఠకాపరి మహా పూజ్య ఉడుమల బాల గారు ప్రధాన అర్చకులుగా మహా పూజ్య రాజారావు గారు మరియు ఇతర గురువులతో కలిసి సమిష్టి దివ్యబలిపూజను సమర్పించారు.

చివరి రోజైన ఫిబ్రవరి 11 ఉదయం, మహా పూజ్య రాజారావు గారు ప్రధాన అర్చకులుగా ఇతర గురువులతో కలిసి సమిష్టి దివ్యబలిపూజను సమర్పించారు.

ఆయన నిష్కళంక అయిన మరియతల్లి యొక్క గొప్పతనాన్ని, రెండవ ఏవ గా ఆమె యొక్క విశిష్టతను గూర్చి విశ్వాసులకు వివరించారు.

పూజానంతరం జరిగిన కార్యక్రమంలో NTR జిల్లా పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని చిన్ని గారు, విజయవాడ శాసన సభ్యులు శ్రీ రామ్మోహన్ గారు మరియు శ్రీ అవినాష్ గారు విచ్చేసి పీఠాధిపతులవారికి మరియు విశ్వాసులకు మహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

వేలాది సంఖ్యలో భక్తులు ఈ మహోత్సవాలలో పాల్గొని గుణదలమాత దీవెనలను పొందారు.