వరద బాధితులకు అండగా విజయవాడ మేత్రాసనం

వరద బాధితులకు అండగా విజయవాడ మేత్రాసనం

విజయవాడ మేత్రాసన  సోషల్ సర్వీస్ సెంటర్  మరియు ప్రేరణ యూత్ వారి ఆధ్వర్యంలో  వరద బాధితులకు నిత్యావసరాలు పంపిణీ కార్యక్రం చేపట్టారు. సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ గురుశ్రీ సునీల్ మరియు ప్రేరణ యూత్ సెంటర్ డైరెక్టర్ గురుశ్రీ  జోజి తంబి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది.

గురువులు , సెయింట్ అలోయిసిస్ సంస్థకు చెందిన సిస్టర్స్ మరియు విశ్వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొని తోటి వారి పట్ల ప్రభు యేసుని నేర్పించిన ప్రేమని తెలియజేస్తున్నారు. మోకాళ్ళ లోతు నీళ్లలో నడుచుకుంటూ వరద బాధితులకు ఆహరం, నిత్యావసర వస్తువులను అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో

భారీ వరదలతో విజయవాడ కన్నీటి సంద్రమైంది. అంతులేని విషాదాన్ని మిగిల్చింది. వరద తగ్గుముఖం పడుతున్నా కొద్దీ… చనిపోయివారి సంఖ్య పెరుగుతోంది. విజయవాడలో వరద బాధితుల కోసం గత మూడు రోజులుగా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.విజయవాడలోని చాలా ప్రాంతాల్లో 5 రోజులుగా కరెంట్ లేదు. దీంతో నగర వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.   

Article and Design By

M. Kranthi Swaroop

RVA Telugu Online Content Producer

 

 

 

 

Telugu Survey Popup Image