మొదలైన ఖైరతాబాద్ ఆరోగ్యమాత మహోత్సవాలు

హైదరాబాద్ అగ్రపీఠం ఖైరతాబాద్ లో కొలువైన "ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం (Our Lady of Good health) వార్షిక మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి

 మొదలైన ఖైరతాబాద్ ఆరోగ్యమాత మహోత్సవాలు   

హైదరాబాద్ అగ్రపీఠం ఖైరతాబాద్ (ఎ.సి. గార్డ్స్) లో కొలువైన "ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం (Our Lady of Good health) వార్షిక మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.ఆగస్టు 29 న  మరియా మాత జెండాను ఎగురవేయడంతో ఈ ఉత్సవాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి.

ఈ  కార్యక్రమంలో కడప పీఠాధిపతులు మహా పూజ్య సాగినాల పాల్ ప్రకాష్ గారు పాల్గొని జెండా ఆవిష్కరణ చేసారు. ఇతర గురువులతో కలసి దివ్యబలి పూజను సమర్పించారు.  వివిధ ప్రాతాలనుండి వచ్చిన ప్రజలు భక్తి శ్రద్ధలతో ఈ ప్రార్థనలో పాల్గొన్నారు. 

నవదిన ప్రార్థనలు తొమ్మిది రోజుల పాటు జరగనున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం ప్రత్యేక  ప్రార్థనలు, దివ్యబలి పూజలు నిర్వహిస్తారు.  భక్తులు తమ కోరికలు నెరవేరాలని, అనారోగ్యాలు తగ్గాలని ఆరోగ్యమాతకు కొవ్వొత్తులు, వెండి వస్తువులు, పూలు మరియు కొబ్బరికాయలను సమర్పిస్తారు.ఇక్కడికి వచ్చే వివిధ ప్రాంతాల భక్తుల కోసం తెలుగు, ఇంగ్లీష్, మరియు తమిళ్ భాషల్లో దివ్యపూజాబలి పూజలు జరుగుతాయి.

విశ్వాసులు మరియమాత జన్మదిన వేడుకలను (ఆరోగ్యమాత పండుగ) సెప్టెంబర్ 8 న ఘనంగా జరుపుకోనున్నారు. పండుగ రోజు సాయంత్రం మేరీ మాత విగ్రహాన్ని పూలతో అలంకరించిన రథంపై ఉంచి చింతల్‌బస్తీ, ఎ.సి. గార్డ్స్ పరిసర వీధుల్లో ఘనంగా ఊరేగిస్తారు.

పండుగ రోజు సాయంత్రం మరియా మాత విగ్రహాన్ని పూలతో అలంకరించిన రథంపై ఉంచి చింతల్‌బస్తీ, ఎ.సి. గార్డ్స్ పరిసర వీధుల్లో ఘనంగా ఊరేగిస్తారు.

Article and Design By M Kranthi Swaroop

 

Telugu Survey Popup Image