మత స్వేచ్ఛను ప్రోత్సహించినందుకు పోప్ లియో లిబర్టీ మెడల్ అందుకోనున్నారు

మత స్వేచ్ఛను ప్రోత్సహించినందుకు పోప్ లియో లిబర్టీ మెడల్ అందుకోనున్నారు

 

అమెరికాకు చెందిన నేషనల్ కాన్‌స్టిట్యూషన్ సెంటర్, జూలై 3,2026న ఫిలడెల్ఫియాలోని ఇండిపెండెన్స్ మాల్‌లో జరిగే అవార్డుల ప్రధానోత్సవంలో పరిశుద్ధ లియో పాపు గారికి 38వ వార్షిక లిబర్టీ మెడల్‌ను ప్రదానం చేయనున్నట్లు ప్రకటించింది.

"ప్రపంచవ్యాప్తంగా మత స్వేచ్ఛ, అంతరాత్మ స్వేచ్ఛ మరియు భావప్రకటనా స్వేచ్ఛను ప్రోత్సహించడంలో పరిశుద్ధ లియో పాపు గారు చేసిన జీవితకాల కృషికి ఈ పురస్కారం గుర్తింపునిస్తుంది. ఈ ఆదర్శాలను అమెరికా వ్యవస్థాపకులు యూఎస్ రాజ్యాంగంలోని మొదటి సవరణలో పొందుపరిచారు," అని నేషనల్ కాన్‌స్టిట్యూషన్ సెంటర్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఆ ప్రకటనలో, మే 2025లో ఎన్నికైనప్పటి నుండి, పోప్ "పరస్పర గౌరవం మరియు శాంతియుత సహజీవనాన్ని ప్రోత్సహించడానికి యూదు, ముస్లిం, క్రైస్తవ మరియు ఇతర మత వర్గాల నాయకులను కలుపుకొని శాంతి మార్గంలో ముందుకు వెళ్తున్నారు అని తెలిపారు .

ఈ కార్యక్రమం ఫిలడెల్ఫియాలోని ఇండిపెండెన్స్ మాల్‌లోని సెంటర్ వెలుపల జరుగుతుంది మరియు లియో పాపు గారు వాటికన్ నుండి లైవ్‌స్ట్రీమ్ ద్వారా వర్చువల్‌గా అంగీకార ప్రసంగం చేయాలని భావిస్తున్నారు.

లిబర్టీ మెడల్ మరియు నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్

1988లో స్థాపించబడి, 2006 నుండి జాతీయ రాజ్యాంగ కేంద్రం ఆధ్వర్యంలో కొనసాగుతున్న లిబర్టీ పతకం, ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు స్వేచ్ఛ యొక్క వరాలను అందించడానికి కృషి చేసే వ్యక్తులను మరియు సంస్థలను గుర్తిస్తుంది.

 

Article and Design by M kranthi Swaroop