ప్రకృతితో కలిసి 91 ఏళ్ల సేవా ప్రస్థానానికి వేడుక
పశ్చిమ భారతదేశంలోని గోవాలో ఉన్న 'కాంగ్రిగేషన్ ఆఫ్ ది హోలీ ఫ్యామిలీ ఆఫ్ నజరేత్' పర్యావరణ పరిరక్షణ పట్ల తన అంకితభావాన్ని మరోసారి చాటి చెప్పింది. తన 91వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురష్కారించుకొని జూన్ 18న మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భముగా సంఘ వ్యవస్థాపకుడు ఫాదర్ ఫౌస్టిన్హో డి సౌజాకు ఘన నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి కాంగ్రిగేషన్ సుపీరియర్ జనరల్ అయిన సిస్టర్ బెర్నా రోడ్రిగ్స్ గారు నాయకత్వం వహించగా, కమ్యూనిటీ యానిమేటర్ అయిన సిస్టర్ ఎస్టెల్లా పెరీరా మరియు కమ్యూనిటీలో సీనియర్ సభ్యురాలైన సిస్టర్ నెవెస్ అజెవెడో గార్లు హాజరయ్యారు. సెయింట్ జోసెఫ్ వాజ్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, శిక్షణలో ఉన్న సిస్టర్లు మరియు కాంగ్రిగేషన్లోని ఇతర సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో 20కి పైగా మొక్కలు నాటారు. పాల్గొన్నవారు మొక్కలు నాటడమే కాకుండా, వాటికి నీరు పోసి, రాబోయే సంవత్సరాలలో వాటిని జాగ్రత్తగా చూసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.
ఫాదర్ డి సౌజా తాను సేవ చేసిన ప్రతిచోటా చెట్లు నాటడాన్ని చురుకుగా ప్రోత్సహించారు. ఆయన చేపట్టిన అత్యంత ప్రసిద్ధ కార్యక్రమాలలో ఒకటి ఉత్తర గోవాలోని మపుసా జిల్లాలో గల డూలర్ అనే ప్రాంతంలోని సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ప్రార్థనా మందిరంలో జరిగింది. అక్కడ ఆయన నియమితులైనప్పుడు, చుట్టుపక్కల ప్రాంతం పొదలతో నిండిపోయి, చాలావరకు నిరుపయోగంగా ఉండటాన్ని గమనించారు. స్థానిక యువతతో కలిసి పనిచేస్తూ, ఆయన ఆ భూమిని చదును చేయడానికి సహాయపడి, చెట్లు నాటడాన్ని మరియు వాటి సంరక్షణను ప్రోత్సహించారు. తద్వారా ఆ ప్రాంతాన్ని మరింత ఆహ్లాదకరమైన సామాజిక ప్రదేశంగా మార్చారు.
గోవాలో అభివృద్ధి ప్రాజెక్టులు, వాటి పర్యావరణ ప్రభావంపై జరుగుతున్న ప్రజా చర్చల నేపథ్యంలో ఈ మొక్కల పెంపకం కార్యక్రమం చేపట్టారు. రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం చెట్లను తొలగించడంపై పర్యావరణ సంఘాలు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
Article and Design BY M kranthi Swaroop