పంగ్కాల్ పినాంగ్ మేత్రాసన 100 సంవత్సరాల వార్షికోత్సవ వేడుక

ఇండోనేషియాలోని బాటమ్ ద్వీపం, ఎంగ్కు పుత్రి బాటమ్ సెంటర్ స్క్వేర్‌ నందు జనవరి 14, 2024 న పంగ్కాల్ పినాంగ్ మేత్రాసనం 100వ వార్షికోత్సవం జరిగింది.

పాంగ్‌కల్ పినాంగ్‌ మేత్రానులు మహా పూజ్య అడ్రియానస్ సునార్కో OFM , ఇగ్నేషియస్ కార్డినల్ సుహార్యో హార్డ్‌జోట్‌మోడ్జో, మహా పూజ్య ఆంటోనియస్ సుబియాంటో B. OSC, ఇండోనేషియా కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ (KWI) అధ్యక్షులు మరియు ఇండోనేషియా నలుమూలల నుండి 12 మందికి పైగా పీఠాధిపతులు దివ్యబలిపూజను సమర్పించారు.

పంగ్కాల్ పినాంగ్ ప్రజల ఉనికికి మరియు మేత్రాసనంలో పనిచేసే మిషనరీలకు వారి కృషిని ప్రశంసిస్తూ ,"దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి మరియు గ్రహించడానికి, అనేక విజయాలు మరియు సవాళ్లు ఎదుర్కొన్నాయి" అని సునార్కో వివరించారు.

ఈ అనుభవాలు పంగ్కల్ పినాంగ్‌లోని చర్చి భవిష్యత్తును ఎదుర్కోవాలని, పవిత్రాత్మ కోరుకున్న పిలుపును వినడానికి మరియు తిరిగి కనుగొనేలా చేసింది.

KWI చైర్‌పర్సన్ బంగ్కా ద్వీపంలోని క్యాథలిక్ చర్చి యొక్క ప్రత్యేక చరిత్రను క్లుప్తంగా చెప్పారు.
"పంగ్కాల్ పినాంగ్ మేత్రాసనంలో విశ్వాసం యొక్క బీజాలు మొదటగా దేవుణ్ణి కలుసుకున్న ఒక సామాన్యుడు తీసుకువచ్చాడు."అతని మిషనరీ స్ఫూర్తి కారణంగా, చైనా నుండి వచ్చిన Paulus Tjen On Ngie, ఇండోనేషియాలోని బంగ్కా ద్వీపానికి చేరుకుని, క్రైస్తవ విశ్వాసాన్ని బోధించడం ప్రారంభించాడు, "అతను కొనసాగించాడు.

Paulus Tjen On Ngie 1830లో ఇండోనేషియాకు చేరుకున్నాడు. అతను సమాజానికి సేవ చేసిన వ్యక్తిగా మరియు కథోలిక విశ్వాసాన్ని బోధించిన మొదటి మిషనరీగా పరిగణించబడ్డాడు.

ఈ వేడుకలో సుమారు 12,000 మందికి పైగా కథోలిక ప్రతినిధులు పాల్గొన్నారు.