నూతన నియామకం

ఫ్రాన్సిస్ పాపు గారు జులై 13,2024 న బెంగుళూరు అగ్రపీఠానికి ఛాన్సలర్ గా సేవనందిస్తున గురుశ్రీ ఆరోకియరాజ్ సతీస్ కుమార్ (47) గారిని సహాయక పీఠాధిపతిగా నియమించారు.

గురుశ్రీ ఆరోకియరాజ్ సతీస్ కుమార్ 5 సెప్టెంబర్ 1977న బెంగళూరులో జన్మించారు.

ఈయన మంగళూరు మేత్రాసనంలోని సెయింట్ జోసఫ్ సెమినరీలో వేదాంతశాస్త్రము మరియు తత్వశాస్త్రాని అభ్యసించారు.

2 మే 2007న బెంగుళూరు అగ్రపీఠానికి గురువుగా నియమితులయ్యారు.

2007-2010 వరకు సెయింట్ జోసఫ్, సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్స్ కథడ్రల్ మరియు మల్లేశ్వరంలో క్రైస్ట్ ది కింగ్ సహాయక విచారణ కర్తగా
2010-2012 బెంగుళూరులోని సెయింట్ పీటర్స్ పోంటిఫికల్ ఇన్స్టిట్యూట్ నుండి కానన్ లాలో మాస్టర్స్ డిగ్రీని
2012-2014 మల్లేశ్వరంలో క్రీస్తు రాజు దేవాలయ విచారణ గురువుగా
2014-2017 పోంటిఫికల్ అర్బన్ యూనివర్శిటీ ఆఫ్ రోమ్‌లో కానన్ లాలో డాక్టరేట్ ను
2017 నుండి ఎక్లెసియాస్టికల్ ట్రిబ్యునల్ న్యాయమూర్తిగా
2018 నుండి భవన్ భక్తి మైనర్ సెమినరీ రెక్టర్ మరియు తుమకూరులోని లూర్డ్స్ అడ్మినిస్ట్రేటర్;
2019 నుండి మేత్రాసన ఛాన్సలర్గా
2020 నుండి, బెంగుళూరులోని సెయింట్ పీటర్స్ పోంటిఫికల్ ఇన్స్టిట్యూట్‌లో కానన్ లా ప్రొఫెసర్;
2021 నుండి, మేజర్ సెమినరియన్ల అధ్యయనాల సమన్వయకర్త తన ఎనలేని సేవను అందించారు.
బెంగుళూరు అగ్రపీఠంలో లాటిన్ కథలిక్ జనాభా 3,60,561, 134 విచారణలు మరియు 157 మేత్రాసన గురువులు ఉన్నారు.

ఇది బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్, చిక్‌బల్లాపూర్, కోలార్, రాంనగర మరియు తుమకూరు సివిల్ జిల్లాలతో కూడిన 27,014 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది.

ఈ అగ్రపీఠ భూభాగం గతంలో మైసూర్ మిషన్‌లో భాగంగా ఉండేది, 1845లో పాండిచ్చేరి నుండి వేరు చేయబడింది.

మైసూర్ మిషన్ 1850లో అపోస్టోలిక్ వికారియేట్‌గా మరియు 1886లో బెంగుళూరు ప్రధాన కార్యాలయంగా ఎదిగింది.

బెంగళూరు మేత్రాసనం ఫిబ్రవరి 13, 1940 న మైసూర్ నుండి విభజించబడింది మరియు ఇది 1953లో అగ్రపీఠంగా మారింది.

మహా పూజ్య పీటర్ మచాడో (70) బెంగుళూరు మెట్రోపాలిటన్ అగ్రపీఠాధిపతిగా , మరియు మహా పూజ్య బెర్నార్డ్ బ్లాసియస్ మోరాస్ (82) విశ్రాంత అగ్రపీఠాధిపతులు.

Tags