దివ్యబలి పూజలో సామాన్యుల ప్రసంగాలకు అనుమతి లేదు - వాటికన్

దివ్యబలి పూజలో  సామాన్యుల ప్రసంగాలకు అనుమతి లేదు - వాటికన్

దివ్యబలి పూజ (Mass) సమయంలో సామాన్య ప్రజలు (Laypeople) ప్రసంగం (Homily) చెప్పడానికి వీల్లేదని వ్యాటికన్ స్పష్టం చేసింది.అసాధారణ పరిస్థితులలో, దివ్య సత్ప్రసాద వేడుక సందర్భంగా సామాన్య విశ్వాసులు ప్రసంగం చేయడానికి అనుమతించాలంటూ జర్మన్ బిషప్స్ కాన్ఫరెన్స్ చేసిన అభ్యర్థనను వాటికన్ తిరస్కరించింది.

దైవారాధన మరియు సంస్కారాల క్రమశిక్షణ కొరకు ఉద్దేశించిన డికాస్టరీ, జర్మన్ బిషప్స్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడైన బిషప్ హైనర్ విల్మర్‌కు జూన్ 17 తేదీన రాసిన లేఖలో ఈ నిర్ణయాన్ని తెలియజేసింది.

"ప్రసంగాన్ని ఒక ఫాదర్  లేదా డీకన్‌కు మాత్రమే కేటాయించడం కేవలం క్రమశిక్షణా నియమం మాత్రమే కాదు, అది ఆరాధన క్రమం యొక్క స్వభావం నుండే ఉద్భవించింది," అని డికాస్టరీ పేర్కొంది.

సువార్త చదివిన తర్వాత దైవసందేశం ఇచ్చే హక్కు కేవలం దీక్ష పొందిన ఫాదర్ లకు (Priests), డీకన్లకు మాత్రమే ఉంటుంది. దివ్యబలి పూజ కాకుండా, సాధారణ ప్రార్థన కూటాలలో  సామాన్యులు ప్రసంగించవచ్చు. క్యాథలిక్ చర్చి సాంప్రదాయాన్ని కాపాడటం కోసమే వ్యాటికన్ ఈ నిర్ణయం తీసుకుంది.

Article and Design By M Kranthi Swaroop