జాతీయ ప్రార్థన మరియు నిరసన దినం -ఏలూరు పీఠం

ఏలూరు పీఠంలో ఆగస్టు 10, శనివారం అమలోద్భవిమాత కథడ్రల్ దగ్గర దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి అని శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

భారత రాజ్యాంగము అన్ని మతాలకు సమాన అవకాశాలు కల్పించినది. సిక్కు, జైన, బౌద్ధ మతములు తీసుకున్న దళితులకు షెడ్యూల్ కులాల హోదా కల్పించారు.

ఈ నిరసనలో ఏలూరు పీఠకాపరి మహా పూజ్య పొలిమేర జయరావు గారు, ఇతర క్రైస్తవు పెద్దలు, మేత్రాసన గురువులు, విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
 
 

Telugu Survey Popup Image