శాంతి స్థాపనకై ప్రార్ధించమని పిలుపునిచ్చిన పోప్

అక్టోబర్ 19 వేదవ్యాపక ఆదివారం నాడు సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో దివ్యబలిపూజ ముగింపులో, పోప్ లియో ప్రపంచవ్యాప్తంగా శాంతి కోసం ప్రార్థించారు.

మే 2021 నుండి ఘర్షణ చెలరేగిన మయన్మార్‌లో కాల్పుల విరమణ కోసం పోప్ విజ్ఞప్తి చేశారు, ఆగ్నేయాసియా దేశం నుండి వస్తున్న వార్తలను "విషాదకరమైనవి" అని పిలిచారు.

హింస మరియు కష్టాల కారణంగా బాధపడుతున్న వారందరికీ తన సాన్నిహిత్యాన్ని తెలియజేస్తూ, మౌలిక సదుపాయాలపై సాయుధ ఘర్షణలు మరియు వైమానిక బాంబు దాడులపై పోప్ విచారణ వ్యక్తంచేశారు.

"తక్షణ కాల్పుల విరమణ కొరకు నా హృదయపూర్వక విజ్ఞప్తిని నేను పునరుద్ఘాటిస్తున్నాను" అని పోప్అన్నారు.

"యుద్ధ సాధనాలు సమగ్రమైన మరియు నిర్మాణాత్మక సంభాషణ ద్వారా శాంతికి దారితీయాలి!"

హోలీ ల్యాండ్, ఉక్రెయిన్ మరియు యుద్ధంతో బాధపడుతున్న ఇతర ప్రదేశాలలో శాంతి కొరకు ప్రార్థించాలి అని పోప్ అన్నారు 

"న్యాయమైన మరియు శాశ్వత శాంతిని సాధించడంలో ముందుకు సాగడానికి ప్రపంచ నాయకులకు దేవుడు జ్ఞానం మరియు పట్టుదలను ప్రసాదించుగాక" అని పోప్అన్నారు.