ఘనంగా "జాతీయ యువతా దినోత్సవం"

ఘనంగా "జాతీయ యువతా దినోత్సవం"

విజయవాడ మేత్రాసనం , ప్రేరణ యూత్ సెంటర్ వారి ఆధ్వర్యంలో" జాతీయ యువతా దినోత్సవం" జులై 28 న ఘనంగా  జరిగింది.  ప్రేరణ యూత్ సెంటర్ డైరెక్టర్ గురుశ్రీ  జోజి తంబి గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.

 ఈ కార్యక్రమం విజయవాడ మేత్రాసన పాస్ట్రాల్ సెంటర్ , కార్మెల్ నగర్ లో జరిగింది.  ఈ   "జాతీయ యువతా దినోత్సవ" వేడుకలలో  ముఖ్యఅతిథిగా విజయవాడ పీఠాధిపతులు మహా పూజ్య తెలగతోటి జోసఫ్ రాజారావు గారు పాల్గొన్నారు.

TCBC ప్రాంతీయ యువత  డైరెక్టర్ గురుశ్రీ సగిలి ప్రవీణ్ కుమార్ గారు , గురుశ్రీ బి బాల SJ, గురుశ్రీ జోజి బాబు ఇతర గురువులు పాల్గొన్నారు.

అధిక సంఖ్యలో యువతీ యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గురుశ్రీ సగిలి ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతూ "యువతను ప్రభుయేసుని మార్గంలో నడవాలని, యువత శోధనలో పడకుండా  ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలని అన్నారు.

ఈ కార్యక్రమం విజయవతంగా జరగడానికి సహకారాన్ని అందించిన ప్రతి ఒక్కరికి  గురువులు గురుశ్రీ జోజి తంబి గారు కృతజ్ఞతలు తెలియచేసారు.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer