సృష్టి సంరక్షణ సందేశంతో ఫ్లోరెస్లో మరియా మాత తీర్థయాత్ర
సృష్టి సంరక్షణ సందేశంతో ఫ్లోరెస్లో మరియా మాత తీర్థయాత్ర
ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ద్వీపంలోని లాబువాన్ బాజో డియోసిస్, ఆగస్టులో జరగనున్న వార్షిక గోలో కో ఫెస్టివల్కు ముందుగా, "మరియ తల్లి మోక్షారోపణ మహోత్సవం"(Our Lady of the Assumption) కు అంకితమైన ప్రత్యేక తీర్థయాత్రను ప్రారంభించింది.
ఈ ఏడాది ఈ ఆధ్యాత్మిక యాత్ర ద్వారా మేరీ మాత భక్తిని సృష్టి సంరక్షణ మరియు పర్యావరణ బాధ్యతతో ముడిపెట్టి, ప్రకృతిని కాపాడాల్సిన క్రైస్తవ బాధ్యతపై విశ్వాసుల్లో అవగాహన పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా నిర్వాహకులు పేర్కొన్నారు.
లాబువాన్ బాజో పీఠాధిపతులు మహాపూజ్య మాక్సిమస్ రెగస్ గారు జూలై 10న లెంగ్కాంగ్ సెపాంగ్లోని సెయింట్ జోసెఫ్ ది వర్కర్ పారిష్లో ఈ మహా ఊరేగింపును ప్రారంభించారు. ఈ యాత్రలో ఆ పవిత్ర మరియమాత ప్రతిమ తో డజన్ల కొద్దీ పారిష్లను సందర్శిస్తూ, వేలాది మంది విశ్వాసులను ప్రార్థన, మరియాభక్తి మరియు సృష్టి సంరక్షణ సందేశం వైపు నడిపించనుంది.
ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ద్వీపంలోని కొండలు, గ్రామాల గుండా సాగుతున్న మరియ తల్లి తీర్థయాత్ర, కాథలిక్కులలో మరియ మాత పట్ల తమ భక్తిని మరింతగా పెంపొందించుకోవడంతో పాటు, దేవుని సృష్టి సంరక్షణ పట్ల తమ బాధ్యతను గుర్తించి పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో ముందుకు సాగాలని అక్కడ గురువులు ఆహ్వానిస్తున్నారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 4న ఈ ఉత్సవాన్ని అధికారికంగా ప్రారంభించినప్పుడే పర్యావరణంపై దృష్టి కేంద్రీకరించినట్లు స్పష్టమైంది. వాతావరణ మార్పులు మరియు పర్యావరణ క్షీణత వంటి సవాళ్లను మానవాళి ఎదుర్కొంటోందని బిషప్ రెగస్ గారు అన్నారు.
ఈ ప్రారంభోత్సవంలో భాగంగా సముద్రతీరాన్ని శుభ్రపరచడం, తీరం వెంబడి కొబ్బరి చెట్లను నాటడం, అలాగే శాంతికి మరియు సృష్టి పట్ల శ్రద్ధకు చిహ్నాలుగా పావురాలను విడుదల చేయడం వంటి కార్యక్రమాలు జరిగాయి.
మరియా మాత ప్రతిమ నంగా లిలి గ్రామం గుండా వెళుతున్నప్పుడు, ముస్లిం నివాసితులు సాంప్రదాయ మంగరాయ్ నృత్యంతో ఊరేగింపుకు స్వాగతం పలికారు. ఇది వివిధ మత వర్గాల మధ్య ఉన్న సన్నిహిత బంధాలను ప్రతిబింబించే ఆతిథ్య సంజ్ఞగా నిలిచింది.
Article and Design By M Kranthi Swaroop