విజయవాడ వరద బాధితులకు సహాయం అందించిన తలితాకుమి ఉన్నతి సంస్థ

తలితాకుమి ఉన్నతి

విజయవాడ వరద బాధితులకు సహాయం అందించిన తలితాకుమి ఉన్నతి సంస్థ

విజయవాడ తరాపేటలోని సెయింట్ అంతోనీస్ కాన్వెంట్ లో తలితాకుమి ఉన్నతి వారు వరద బాధితులకు సహాయంగా వస్త్రాలు మరియు నిత్యావసర సరుకులను అందించారు. తలితాకుమి ఉన్నతి సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ గురుశ్రీ కుమార్ గారు విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడారు. బాలికలకు చేయూతనివ్వడం తలితాకుమి ఉన్నతి సంస్థ ముఖ్య ఉద్దేశం అని ఆయన అన్నారు. విచారణ గురువు గురుశ్రీ విజయ్ కుమార్ గారి చేతుల మీదుగా చిన్నారులకు ఈ సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి సిస్టర్ లావణ్య, సిస్టర్ ఇన్నమ్మ, సుపీరియర్ సిస్టర్ మేరీ కుమారి, అట్కిన్సన్ స్కూల్ ప్రిన్సిపాల్ సిస్టర్ అజిత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.