రామంతాపూర్ లో జరిగిన ఎమ్మాయోస్ థియోలజీ అల్యూమిని రీయూనియన్

ఎమ్మాయోస్ థియోలజీ అల్యూమిని రీయూనియన్

రామంతాపూర్ లో జరిగిన ఎమ్మాయోస్ థియోలజీ అల్యూమిని రీయూనియన్

17 జులై 2024 న ఎమ్మాస్ థియోలజీ అల్యూమిని రీయూనియన్ రామంతాపూర్ లోని పునీత  యోహాను గురు శిక్షణ కేంద్రం లో జరిగింది.

ఈ కార్యక్రమానికి పాత విద్యార్థులు మరియు ప్రొఫెసర్లు హాజరయ్యారు. కార్యక్రమంలో గురుశ్రీ రాజు అలెక్స్ విచ్చేసిన సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. సుమారు 50 మంది సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కారితక్రమంలో సభ్యులు తమ ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి, మరియు తమ అనుభవాలను గూర్చి పంచుకున్నారు. విశ్వాసులు ఒక మంచి విశ్వాస అనుబంధంలో ఉండడానికి చెయ్యవలసినది ఏమిటో చర్చించారు. రానున్న కాలంలో ఎక్కువమంది విశ్వాసులు వేదాంత శాస్త్రం పట్ల మక్కువ చూపించి బైబిల్ లోని మర్మాలు తెలుసుకోవాలని, దానికి చెయ్యవలసినది ఏమిటో ఈ కార్యక్రమంలో చర్చించారు. 

Article by: Arvind Bandi

Online Content Producer