"పరిశుద్ధాత్మ స్వస్థత మహాసభలు" | వెంగాపురం విచారణ

prayer_meet_vengapuram.jpg

విశాఖ అతిమేత్రాసనం, వెంగాపురం విచారణలో "పరిశుద్ధాత్మ స్వస్థత మహాసభలు" జరుగుతున్నాయి.

 మార్చి 5,6,7 మూడురోజుల పాటు జరగనున్న ఈ "పరిశుద్ధాత్మ స్వస్థత మహా సభలు"  లో
ప్రతి రోజు సా|| 5 గంటల నుండి జపమాల ,దివ్యబలిపూజ, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఈ స్వస్థత మహాసభలు  వెంగాపురం విచారణ కర్తలు గురుశ్రీ ఆనంద్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.  

మొదటి రోజు  "పరిశుద్ధాత్మ స్వస్థత మహా సభలు" లో గురుశ్రీ విజయ్ భాస్కర్ గారు పాల్గొన్నారు.  అధిక సంఖ్యలో విశ్వాసులు, విచారణ ప్రజలు పాల్గొన్నారు. విచారణ గాయక బృందం మధురమైన గీతాలను ఆలపించారు.   

రెండవ రోజు మరియు మూడవరోజు ఆధ్యాత్మిక గురువులు గురుశ్రీ బెన్నీ (SVD) (డైరెక్టర్ దివ్యవాక్కు కేంద్రం, ఏలూరు) గారు పాల్గొని అమూల్యమైన దైవ సందేశాన్ని అందించనున్నారు.

ప్రజలందరూ ఈ శ్రమలకాలంలో ఎక్కువ సమయం ప్రార్థనలలో గడపాలని, ప్రభు యేసుని మార్గంలో నడవాలని  గురుశ్రీ ఆనంద్ గారు కోరారు.

ప్రజలు, విశ్వాసులు   ఈ పరిశుద్ధాత్మ స్వస్థత మహా సభలలో పాల్గొనాలని గురుశ్రీ కిల్లాడ ఆనంద్ గారితో పాటు డీకన్. రవితేజ, వెంగాపురం విచారణ  కన్మస్త్రీలు, ఉపదేశులు, పెద్దలు, విశ్వాసులు ప్రేమతో ఆహ్వానించుచున్నారు.

 

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer