నూతన దివ్యసత్ప్రసాద స్వీకరణ

వరంగల్ మేత్రాసనం, ఫాతిమానగర్ కథెడ్రల్ దేవాలయం నందు 4,ఫిబ్రవరి 2024న ఉదయం 7:30 గంటలకు నూతన దివ్యసత్ప్రసాద స్వీకరణ జరిగింది.

వరంగల్ పాస్టరల్ సెంటర్ డైరెక్టర్ గురుశ్రీ గోపు కమల్,  అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా కేథడ్రల్ విచారణ కర్తలు గురుశ్రీ కాసు మర్రెడ్డి, గురుశ్రీ కరుణాకర్ SJ. మరియు గురుశ్రీ సుధాకర్ గార్లు దివ్యబలి పూజను సమర్పించారు.

గురువులు, విచారణ విశ్వాసులు మరియు నూతన దివ్యసత్ప్రసాదం స్వీకరించిన పిల్లల తల్లిదండ్రులు ఈ పూజలో పాల్గొని పిల్లల కోసం ప్రార్థనలు చేశారు.

విచారణ నుండి 30 మంది నూతనంగా దివ్య సత్ప్రసాదమును స్వీకరించారని విచారణ కర్తలు గురుశ్రీ కాసు మర్రెడ్డి గారు తెలిపారు.