క్రైస్తవ నిర్మాణానికి సహనం, తోడు, రక్షణ అవసరం - పోప్ లియో XIV

 క్రైస్తవ నిర్మాణానికి సహనం, తోడు, రక్షణ అవసరం - పోప్ లియో XIV
 
ఫిబ్రవరి 6 శుక్రవారం రోజున  సామాన్యులు, కుటుంబం మరియు జీవితం కోసం డికాస్టరీ యొక్క ప్లీనరీ అసెంబ్లీలో పాల్గొన్న వారిని ఉద్దేశించి పరిశుద్ధ పోప్ లియో XIV గారు ప్రసంగించారు. ఈ సందర్భముగా  క్రైస్తవ నిర్మాణం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు, అన్ని రకాల దుర్వినియోగాలను నిరోధించాల్సిన అవసరం ఉందని తెలిపారు. 

ఈ ప్లీనరీ సమావేశం ఫిబ్రవరి 4-6 తేదీలలో రోమ్‌లో జరిగింది. ఈ సమావేశం  "'మీలో క్రీస్తు ఏర్పడే వరకు' (గల 4:19): క్రైస్తవ జీవితంలో సామాన్యుల నిర్మాణం మరియు ప్రపంచ సమావేశాల అనుభవం" అనే ఇతివృత్తంపై దృష్టి సారించింది.

పరిశుద్ధ పోప్ లియో XIV గారు తన ప్రసంగంలో, క్రైస్తవ నిర్మాణం యొక్క అనేక ముఖ్యమైన అంశాలను ప్రతిబింబించారు. విశ్వాసాన్ని ఉత్పత్తి చేసేది దేవాలయం అని అన్నారు. "విశ్వాసాన్ని ఉత్పత్తి చేసేది గురువు ఒక్కడే కాదు, ఒక ఆకర్షణీయమైన నాయకుడు కూడా కాదు, విశ్వాస కుటుంబాలు, యువకులు, ఒంటరి వ్యక్తులు అందరు అని,  క్రైస్తవ జీవితం కేవలం వ్యక్తిగత విశ్వాసం కాదు, అది సమాజంలో (సంఘంలో) ప్రేమను పంచుతూ ప్రసారం చేయబడే ఒక జీవన విధానం. పరస్పర ప్రేమానుబంధం, భారం మోయడం, క్రీస్తు బోధనలను ఆచరణలో పెట్టడం ద్వారా దేవుని ప్రేమను లోకానికి చాటడం ఇందులో ముఖ్య ఉద్దేశం అని , ఈ ప్రేమయే క్రైస్తవ సాక్ష్యానికి మూలం అని అన్నారు.

"స్థిరమైన, ఆకర్షణీయమైన మరియు వ్యక్తిగత జీవిత మార్గాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని పరిశుద్ధ పోప్ లియో XIV గారు అన్నారు.ఈ సందర్భముగా ఆయన సెయింట్ ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా, సెయింట్ ఫిలిప్ నెరి, సెయింట్ జోసెఫ్ కలసాంజ్, సెయింట్ గాస్పర్ డెల్ బుఫాలో, సెయింట్ జాన్ లియోనార్డి మరియు సెయింట్ అగస్టీన్ వంటి కొన్ని ముఖ్యమైన పునీతులను ఉదహరించారు.

Article and design by 

M kranthi Swaroop