క్రైస్తవులపై దాడులను ఖండించాలని ప్రధానమంత్రికి బిషప్లు విజ్ఞప్తి చేశారు
క్రైస్తవులపై దాడులను ఖండించాలని ప్రధానమంత్రికి బిషప్లు విజ్ఞప్తి చేశారు
CBCI 37వ సర్వసభ్య సమావేశానికి ముందు బెంగళూరులో జరిగిన విలేకరుల సమావేశంలో, క్రైస్తవులపై దాడులను ఖండించాలని మరియు భారత రాజ్యాంగానికి అనుగుణంగా మతపరమైన మైనారిటీలను రక్షించాలని కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా(CBCI ) ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరింది.
క్రైస్తవులు మరియు ప్రార్థనా స్థలాలపై దాడులను ఖండించాలని మరియు భారతదేశ రాజ్యాంగ హక్కులను పరిరక్షించడానికి దృఢమైన చర్యలు తీసుకోవాలని కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (CBCI) ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేసింది.
37వ CBCI సర్వసభ్య సమావేశానికి సమావేశానికి ముందు బెంగళూరులో జరిగిన విలేకరుల సమావేశంలో CBCI అధ్యక్షుడు ఆర్చ్ బిషప్ మహా పూజ్య ఆండ్రూస్ థాజత్ గారు మాట్లాడుతూ, మతపరమైన మైనారిటీలు సహా అన్ని పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడం ప్రభుత్వానికి రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని అన్నారు."క్రైస్తవులపై దాడి జరిగినప్పుడల్లా, మేము శాంతియుత మార్గాల ద్వారా సంబంధిత అధికారులను కలుస్తున్నాము అని అన్నారు.
విలేకరుల సమావేశంలో CBCI సెక్రటరీ జనరల్ ఆర్చ్ బిషప్ మహా పూజ్య అనిల్ JT కౌటో, వైస్-ప్రెసిడెంట్ II బిషప్ మహా పూజ్య జోసెఫ్ మార్ థామస్, డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఫాదర్ మాథ్యూ కోయికల్ మరియు CBCI పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఫాదర్ రాబిన్సన్ రోడ్రిగ్స్ గార్లు పాల్గొన్నారు.
క్రైస్తవులపై దాడుల విస్తృత ప్రభావాన్ని హైలైట్ చేస్తూ, సామాజిక కార్యకర్త అజయ కుమార్ సింగ్ మాట్లాడుతూ, ఇటువంటి సంఘటనలు ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు సమానమని అన్నారు.
కుటుంబాలు తమ సొంత ఇళ్లలో మరియు దేవాలయాలలో ప్రార్థనలు చేయకుండా అడ్డుకుంటున్నారు అని , చనిపోయినవారిని గౌరవప్రదంగా ఖననం చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నారని అన్నారు అని సింగ్ అన్నారు.
Article and Design By
M kranthi Swaroop