కారవాన్ ఆఫ్ పీస్ తో కలిసి ప్రార్ధించిన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు 

కారవాన్ ఆఫ్ పీస్
పోప్ ఫ్రాన్సిస్

పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఆదివారం ఏంజెలూస్‌ను ఇద్దరు పిల్లలతో  కలిసి ప్రార్ధించారు.

ప్రియమైన పరిశుద్ధ పాపు గారా, ప్రతి సంవత్సరం మాదిరిగానే, మేము ఇక్కడ ఉన్నాము, మొత్తం నగరానికి మరియు ప్రపంచం మొత్తానికి శాంతి కోసం మా కోరిక.

రోమ్‌ నగరం లోని పాఠశాలలు మరియు విచారణల నుండి ఇద్దరు పిల్లలు వచ్చారు. ప్రతి సంవత్సరం, వారు కాథలిక్ యాక్షన్ నిర్వహించే "కారవాన్ ఆఫ్ పీస్"లో పాల్గొంటారు. ఈ సంవత్సరం, ప్రపంచంలోని అనేక ప్రాంతాల పరిస్థితుల దృష్ట్యా వారి చొరవకు ప్రత్యేక ఔచిత్యం ఉంది

పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఉక్రెయిన్ మరియు పవిత్ర భూమిలో శాంతి కోసం తన అభ్యర్థనను పునరుద్ధరించారు. ఆయన బర్మాను కూడా ప్రత్యేకంగా పేర్కొన్నారు, ఇక్కడ రెండు సంవత్సరాల కంటే ఎక్కువ అంతర్యుద్ధం వేలాది మంది ప్రజలను స్థానభ్రంశం చేసింది అని ఆయన అన్నారు.

శాంతి అనేది ఒక మార్గం, మయన్మార్ భూమి సోదర సయోధ్య లక్ష్యాన్ని చేరుకోవడానికి వీలుగా చర్చల చర్యలు తీసుకోవాలని మరియు అవగాహనతో తమను తాము ధరించుకోవాలని నేను అన్ని పక్షాలకు పిలుపునిచ్చాను అని పాపు గారు చెప్పారు.

హైతీలో కిడ్నాప్ చేయబడిన కన్యస్త్రీలను విడుదల చేసినందుకు పరిశుద్ధ పాపు గారు తన హర్షాన్ని వ్యక్తం చేసారు మరియు టర్కీలోని ఒక విచారణపై దాడి చేసి ఒకరు చంపబడడాన్ని ఆయన ఖండించారు.