తన పాపసంకీర్తనాన్ని వినే గురువు సమాధి ముందు ప్రార్ధించిన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు

గురువు సమాధి ముందు ప్రార్ధించిన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు

తన పాపసంకీర్తనాన్ని వినే గురువు సమాధి ముందు ప్రార్ధించిన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు

ఏంజెలూస్ సమయంలో, ప్రపంచ శాంతి కోసం తన కోరికను పునరుద్ఘాటిస్తున్నప్పుడు, పరిశుద్ధ  ఫ్రాన్సిస్ పాపు గారు రోమ్‌లోని చారిత్రక విచారణను సందర్శించడానికి వాటికన్ నుండి మళ్లీ బయలుదేరినట్లు వెల్లడించారు.

ముఖ్యంగా ఉక్రెయిన్, పాలస్తీనా, ఇజ్రాయెల్‌లో శాంతి కోసం ప్రార్థిస్తూనే ఉంటాం. నేను ఇజ్రాయెల్ జెండాను చూస్తున్నాను. ఈ రోజు నేను పవిత్ర నలభై అమరవీరుల దేవాలయం నుండి వస్తున్నప్పుడు చూశాను. ఇది శాంతికి పిలుపు అని పాపు గారు అన్నారు.

ఆయన 85 సంవత్సరాల వయస్సులో మరణించిన స్పెయిన్ దేశానికి చెందిన ఫ్రాన్సిస్కాన్ మాన్యుయెల్ బ్లాంకో యొక్క సమాధి ముందు ప్రార్థన చేయడానికి ఆ విచారణకు వెళ్ళారు .

రోమ్‌లోని పవిత్ర నలభై అమరవీరుల దేవాలయం మరియు సెయింట్ పాస్చల్ బైలన్‌లో 44 సంవత్సరాలు నివసించిన ఫ్రాన్సిస్కన్ గురువు మాన్యువల్ బ్లాంకో మరణించారు. ఆయన ఉన్నతాధికారి, సలహాదారు. ఆయనను స్మరించుకుంటూ, చర్చ్ ఆఫ్ రోమ్‌ను గౌరవించిన  అనేక మంది ఫ్రాన్సిస్కాన్ గురువులు మరియు బోధకులను నేను గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను. వారందరికీ ధన్యవాదాలు అని పాపు గారు అన్నారు.

ఇతర సందర్భాల్లో, పాపు గారు తాను ప్రతి రెండు వారాలకు ఒకసారి పాపసంకీర్తనానికి వెళ్లానని చెప్పారు .