తెలుగు క్రైస్తవ సంఘాల సమాఖ్య (FTC) కార్యకలాపాలపై సమీక్ష

తెలుగు క్రైస్తవ సంఘాల సమాఖ్య (FTC) ఫిబ్రవరి 16న 2026 హైదరాబాద్ అగ్రపీఠంలోని, సిక్కు విలేజ్‌,జ్యోతిర్మయి సెంటర్‌లో క్రైస్తవ సమైక్యతా ముందస్తు కార్యకలాపాలు మరియు ప్రణాళికలపై  సంప్రదింపులను నిర్వహించింది.

ఈ సమావేశానికి నెల్లూరు పీఠ సహకాపరి మరియు తెలుగు క్రైస్తవ సంఘాల సమాఖ్య (FTC) అధ్యక్షులు మహా పూజ్య పిల్లి అంతోని దాస్ గారు అధ్యక్షత వహించారు.

ఈ సమావేశానికి బిషప్‌లు, గురువులు, పాస్టర్లు మరియు ఇతర క్రైస్తవ సంఘాల నాయకులతో సహా దాదాపు 20 మంది పాల్గొన్నారు.

2025లో FTC చేపట్టిన క్రైస్తవ సమైఖ్య కార్యకలాపాలను సమీక్షించి మరియు 2026 సంవత్సరానికి ప్రణాళికలు మరియు ప్రాధాన్యతలను చర్చించారు.

FTC చేపట్టిన కార్యక్రమాలకు ప్రశంసలు వ్యక్తమయ్యాయి. ఈ ప్రయత్నాలను మరింత బలోపేతం చేయవలసిన అవసరాన్నితెలుపుతూ, ముఖ్యంగా 2030లో జరిగే FTC రజతోత్సవానికి సన్నాహకంగా, స్థానిక స్థాయిలో జిల్లా యాక్షన్ కమిటీ (DAC) ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించారు.

తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ దీపక్ జాన్ ఈ సమావేశానికి గౌరవ అతిథిగా హాజరయ్యారు. క్రైస్తవ సమాజంపై జరుగుతున్న ఆందోళనలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, క్రైస్తవుల అభ్యున్నతికి తోడుగా వుంటుందని సభకు హామీ ఇచ్చారు. 

ఛైర్మన్ బిషప్ తెలుగు ప్రాంతంలోని క్రైస్తవుల ఉమ్మడి మంచి మరియు ప్రభావవంతమైన క్రైస్తవ సాక్ష్యం కోసం ఐక్యంగా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. చివరన అందరు కలసి సహవాస విందును భుజించారు.