యువ కమ్యూనికేటర్ల సామర్థ్యాల పెంపుకు AI శిక్షణ కార్యక్రమం

యువ కమ్యూనికేటర్ల సామర్థ్యాల పెంపుకు AI శిక్షణ కార్యక్రమం

మధ్య భారతదేశంలోని వివిధ డియోసెస్‌ల నుండి యువ కమ్యూనికేటర్లను ఒకచోట చేర్చి, కంటెంట్ సృష్టి కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాధనాల వినియోగంపై మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వారం రోజుల పాటు శిక్షణా కార్యక్రమం జరుగుతోంది.
జూన్ 14–21 వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని, ఇండోర్‌లోని "సొసైటీ ఆఫ్ ది డివైన్ వర్డ్" (SVD) వారి ప్రాంతీయ కాథలిక్ కమ్యూనికేషన్స్ సెంటర్ అయిన సత్ప్రకాశన్ సంచార్ కేంద్రం  మరియు  రేడియో వెరితాస్ ఆసియ హిందీ  (RVA Hindi) సహకారంతో నిర్వహిస్తోంది.

ఇండోర్ బిషప్ మహా పూజ్య థామస్ మాథ్యూ గారి  అధ్యక్షతన జరిగిన దివ్య సత్ప్రసాద ఆరాధన , దివ్యబలిపూజ తో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.

తన ప్రసంగంలో, పీఠాధిపతులు  మహా పూజ్య థామస్ మాథ్యూ  గారు  డిజిటల్ ప్రపంచంలో మన ప్రభువైన యేసు క్రీస్తుకు నిజమైన సాక్షులుగా నిలవాలని, అలాగే సత్యం, నిరీక్షణ, మానవ గౌరవాన్ని ప్రోత్సహించేందుకు సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని పాల్గొనేవారిని ప్రోత్సహించారు. 

ఈ కార్యక్రమంలో సత్ప్రకాశన్ సంచార్ కేంద్రం డైరెక్టర్ అయిన ఫాదర్ సిరియాక్ పీటర్, శిక్షణా కార్యక్రమ సమన్వయకర్త అయిన ఫాదర్ బాబు జోసెఫ్ కరకోంబిల్, రేడియో వెరితాస్ ఆసియ హిందీ కోఆర్డినేటర్ ఫాదర్ ఆంథోనీ స్వామి, ఇండియా ఉపాధ్యక్షుడు మరియు రచయిత అయిన శ్రీ సుమిత్ ధనరాజ్,శ్రీ హర్నీత్ సింగ్  మరియు సిస్టర్స్ పాల్గొన్నారు. 

ఇండోర్‌లోని సత్ప్రకాశన్ సెంటర్‌లో నిర్వహిస్తున్న AI శిక్షణా కార్యశాలలో 21 మంది యువ కమ్యూనికేటర్లు పాల్గొంటున్నారు. డిజిటల్ ప్రపంచంలో సమర్థవంతంగా సేవలందించేందుకు వారిని డిజిటల్ అంబాసిడర్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ శిక్షణ అందిస్తున్నారు.  వారిని వారి వారి డియోసెస్‌లు మరియు కమ్యూనిటీలలో డిజిటల్ అంబాసిడర్‌లుగా సేవ చేయడానికి సిద్ధం చేస్తున్నారు.

 

Article and Design By M Kranthi Swaroop