హంటావైరస్ గురించి మాట్లాడిన పోప్ లియో

ఆదివారం మే 10 న రెజీనా కేలీలో హంటావైరస్ గురించి పోప్ లియో మాట్లాడారు

హంటావైరస్ సంక్షోభం ఎలా పరిణమిస్తుందోనని ప్రపంచం ఆందోళన చెందుతున్నారు . ఈ వైరస్ ఎలుకల ద్వారా మానవులకు సోకగల ఒక ప్రాణాంతక వ్యాధి.

MV హోండియస్ అనే క్రూయిజ్ నౌకలో అనేక మరణాలు, ఇన్ఫెక్షన్లు సంభవించిన తరువాత ఈ వ్యాధి గురించిన వార్తలు వెలుగులోకి వచ్చాయి.

ప్రారంభంలో ముగ్గురు మరణించగా, ఇతర ప్రయాణికులు కూడా ఈ వ్యాధి బారిన పడ్డారు.

పోప్ లియో, సహా ప్రపంచ నాయకులు ఈ సంక్షోభాన్ని నిశితంగా గమనిస్తున్నారు.

హంటావైరస్ రోగులతో ఉన్న హోండియస్ క్రూయిజ్ నౌక రాకను అనుమతించడం ద్వారా ఆతిథ్యం ఇచ్చిన కానరీ దీవుల ప్రజలకు నేను ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను అని పోప్ అన్నారు 

వచ్చే నెలలో ద్వీపాలు పర్యటనలో భాగంగా మిమ్మల్ని కలవబోతున్నందుకు నేను సంతోషిస్తున్నాను.

హోండియస్ నౌకలో క్వారంటైన్‌లో ఉన్నవారిలో ఇంకా ఎవరికీ పాజిటివ్ కేసులు నిర్ధారణ కాలేదు—కానీ కొన్ని గంటల తర్వాత, కానరీ దీవులలో ప్రయాణికులు దిగి తమ ఇళ్లకు తిరిగి వెళ్తుండగా, ఫ్రాన్స్ మరియు యునైటెడ్ స్టేట్స్ తమ దేశాలలో కొత్త కేసులను నిర్ధారించడం ప్రారంభించాయి.

మాతృ దినోత్సవం సందర్భంగా ఆదివారం చేసిన తన ప్రసంగంలో, మరియతల్లిని ఆదర్శంగా తీసుకోవాలని మిమల్ని ప్రోత్సహిస్తూ, ఇటీవల తీవ్రవాద దాడులకు గురైన దేశాలైన Chad మరియు Maliలో పెరుగుతున్న హింస పట్ల పోప్ ఆందోళన వ్యక్తం చేశారు.