మధ్యప్రాచ్య క్రైస్తవుల బాధలను గుర్తుచేసుకుని పోప్
మార్చి 29, 2026 వాటికన్ లో మ్రానికొమ్మల ఆదివారం నాడు పోప్ లియో మధ్యప్రాచ్యంలో క్రైస్తవులు ఎదుర్కొంటున్న బాధలను ప్రస్తావిస్తూ, కొనసాగుతున్న యుద్ధాల కారణంగా చాలా మంది ఈ పవిత్ర వారాన్ని సరిగా ఆచరించలేకపోతున్నారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.
యేసు క్రీస్తు శ్రమలను ధ్యానిస్తున్నట్లే, ఈనాడు ఎంతమంది వారి బాధలలో ప్రత్యక్షంగా పాలుపంచుకుంటున్నారో మనం వారిని మరచిపోకూడదు అని పోప్ అన్నారు
శాంతిదూత అయిన దేవునికి మన విన్నపాలను తెలియజేద్దాం, తద్వారా ఆ ప్రభువు యుద్ధం వలన గాయపడిన ప్రజలకు అండగా నిలిచి, సయోధ్య మరియు శాంతికి నిర్దిష్ట మార్గాలను తెరుస్తారు.
యుద్ధానికి బలి అయిన నావికులను కూడా నేను ప్రభువుకు అప్పగించాలనుకుంటున్నాను అని పోప్ అన్నారు .
మరణించిన వారి కోసం, గాయపడిన వారి కోసం, మరియు వారి కుటుంబాల కోసం నేను ప్రార్థిస్తున్నాను.
భూమి, ఆకాశం, మరియు నీరు జీవం కోసం మరియు శాంతి కోసం సృష్టించబడ్డాయి.
సముద్రంలో మరణించిన వలసదారులందరి కోసం, ప్రత్యేకంగా గత కొన్ని రోజులుగా CRETE ద్వీపం వద్ద ప్రాణాలు కోల్పోయిన వారి కోసం పొప్ ప్రత్యేకంగా ప్రార్ధించారు.