బమెండా ప్రజలకు శాంతి సందేశాన్ని అందించిన పోప్

పోప్ లియో తన ఆఫ్రికా పర్యటనలో భాగంగా కామెరూన్‌లో సందర్శించిన రెండవ నగరం బమెండా.

బమెండాలోని పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉంది: ఈ ప్రాంతం కామెరూన్‌లో ఆంగ్లోఫోన్ సంక్షోభంగా పిలువబడే సుదీర్ఘ అంతర్గత యుద్ధానికి వేదికగా ఉంది.

తాత్కాలిక కాల్పుల విరమణ ఉన్నప్పటికీ, పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది.

కొనసాగుతున్న హింస, అపహరణలు, సాయుధ ఘర్షణలు మరియు ప్రజల స్థానభ్రంశం కొనసాగుతూనే ఉన్నాయి 

ఈ కారణంగా, పోప్ ఈ ప్రదేశాన్ని సందర్శించి  శాంతి సందేశాన్ని అందించారు, దానిని ఆయన సెయింట్ జోసఫ్ కథడ్రల్‌లో ప్రసంగించారు.

కామెరూన్‌లోని ఈ ప్రాంతాలను ప్రభావితం చేస్తున్న సంక్షోభం... క్రైస్తవ మరియు ముస్లిం వర్గాలను మునుపెన్నడూ లేనంతగా దగ్గర చేసింది.

నిజానికి, మీ మత నాయకులు శాంతి ఉద్యమాన్ని స్థాపించడానికి ఏకమయ్యారు, దీని ద్వారా వారు వ్యతిరేక వర్గాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నిస్తున్నారు అని పోప్ అన్నారు .

అంతేకాకుండా, యుద్ధాన్ని ప్రత్యక్షంగా అనుభవించి, ఆ సంఘర్షణ వల్ల జీవితాలు పూర్తిగా మారిపోయిన ప్రజల నుండి వివిధ సాక్ష్యాలను వినే అవకాశం పోప్‌కు లభించింది. 

బమెండా ప్రజలు శాంతి దూతలుగా ఉండాలని పోప్ లియో పేర్కొన్నారు. దీనికి చిహ్నంగా, ఆయన చర్చి నుండి బయలుదేరేటప్పుడు శాంతి మరియు సయోధ్యకు సార్వత్రిక చిహ్నమైన ఒక పావురాన్ని ఎగురవేశారు.