నైరుతి కొలంబియా బాధితుల కొరకు ప్రార్దించిన పోప్

బుధవారం ఏప్రిల్ 29 న జరిగిన సాధారణ ప్రేక్షకుల సమావేశంలో స్పానిష్ మాట్లాడే యాత్రికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, నైరుతి కొలంబియాలో తీవ్రమవుతున్న హింసను పోప్ లియో గుర్తుచేసుకున్నారు.

గత శుక్రవారం నుంచి తిరుగుబాటు బృందాలు పౌరులు, సైనిక స్థావరాలపై కనీసం 26 దాడులు జరిపి, వందలాది మందిని చంపారు,కొలంబియాలోని పరిస్థితికి విచారిస్తూ తన ఆందోళను వ్యక్తం చేశారు.

ఆ ప్రాంతంలోని హింసకు గురియైన వారి కొరకు ప్రార్థించారు.ఈ ప్రార్థనల ద్వారా నా సాన్నిహిత్యాన్ని తెలియజేస్తున్నాను," అని పోప్అన్నారు.

ప్రతి ఒక్కరూ అన్ని రకాల హింసలను తిరస్కరించి, శాంతి మార్గాన్ని నిశ్చయంగా ఎంచుకోవాలని నేను కోరుతున్నాను." అని పోప్అన్నారు.

మే 31న జరగనున్న కొలంబియా అధ్యక్ష ఎన్నికలకు ముందు ఈ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.

2016లో దేశ ప్రభుత్వంతో కుదిరిన శాంతి ఒప్పందంలో భాగంగా రద్దు చేయబడిన FARC (కొలంబియా విప్లవ సాయుధ దళాలు) తిరుగుబాటు గ్రూపునకు చెందిన FARC-EMC అనే సంస్థే ఈ దాడులకు కారణమని ప్రభుత్వ అధికారులు ఆరోపించారు.

శనివారం, కాలి మరియు పోపయాన్ నగరాల మధ్య ఉన్న ఒక రహదారిపై జరిగిన ఘోరమైన పేలుడులో 21 మంది మరణించారు.

విశ్లేషకుల ప్రకారం, మే నెలాఖరులో అధ్యక్షుడిగా ఎన్నికయ్యే వారికి తమ ప్రాణాంతక సామర్థ్యాలను ప్రదర్శించి, తమ విశ్వసనీయతను నిరూపించుకోవడానికి FARC-EMC ప్రయత్నిస్తూ ఉండవచ్చు.

2016 శాంతి ఒప్పందంలో చేరడానికి నిరాకరించిన నెస్టర్ వెరా—సాధారణంగా  Iván Mordiscoగా పిలువబడే—దీనికి నాయకత్వం వహిస్తున్నారు.

మాదకద్రవ్యాల అక్రమ రవాణా మార్గాలు మరియు అక్రమ బంగారు గనులపై నియంత్రణ కోసం పోరాడుతూ, తిరుగుబాటుదారులు కాకా ప్రావిన్సు మరియు వల్లే డెల్ కాకా ప్రావిన్సులలో తమ ఉనికిని బలంగా ఏర్పరచుకున్నారు.

ఈ బృందం 2023 చివరిలో కొలంబియా ప్రభుత్వంతో శాంతి చర్చలు ప్రారంభించింది, కానీ ఒక వర్గం 2024 ఏప్రిల్‌లో ఆ చర్చలను విడిచిపెట్టి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ పోరాటాన్ని పునఃప్రారంభించింది.

ఆదాయాన్ని పెంచుకోవడానికి స్థానిక నివాసితులను భయపెట్టడానికి డ్రోన్‌లు మరియు కార్ బాంబులను ఉపయోగించడంతో పాటు, కిడ్నాప్‌లకు పాల్పడటం మరియు ఆ ప్రాంతంలో నివసించే వారిపై పన్నులు విధించడం వంటివి  FARC-EMC  చేస్తోంది.