భక్తి శ్రద్ధలతో 14 దేవాలయాలలో సిలువమార్గం

భక్తి శ్రద్ధలతో 14 దేవాలయాలలో సిలువమార్గం

ఎలోహిం హీలింగ్ మినిస్ట్రీస్ వారి ఆద్వర్యం లో 14 దేవాలయాలలో సిలువమార్గం భక్తి శ్రద్ధలతో జరిగింది. బ్రదర్ అంతోనీ పాట్రిక్ గారు ముందుండి ఈ కార్యక్రమాన్ని నడిపించారు.

వివిధ విచారణాల నుండి సుమారు 200 మంది పాల్గొన్నారు. ముఖ్యంగా యంజాల విచారణ నుండి సుమారు 60 మంది విశ్వాసులు పాల్గొన్నారు. ఉదయం 6 గంటలకు అమృతవాణి నుండి ఈ కార్యక్రమం మొదలైనది. 3 బస్సులలో, కార్లలో భక్తులు పాల్గొన్నారు.ప్రతి ఒక్కరు సిలువను పట్టుకొని ప్రతి దేవాలయాన్ని సందర్శించారు. ప్రతి విచారణలో ఒక్కొక స్థలం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.

వివిధ విచారణ కర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని విశ్వాసుల కొరకు ప్రత్యేకించి ప్రార్ధించారు. అమృతవాణి డైరెక్టర్ గురుశ్రీ పప్పుల సుధాకర్ గారు చివరి దివ్యపూజాబలిని సమర్పించి , విశ్వాసుల కొరకు ప్రార్ధించారు.

బ్రదర్ అంతోనీ పాట్రిక్ గారు విశ్వాసులకు ప్రేమ విందును ఏర్పాటు చేసారు. సహాయం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

 

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer