గుంటూరు మేత్రాసనంలో చెరసాల పరిచర్య వార్షిక సమావేశం

భారత చెరసాల పరిచర్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగం ఫిబ్రవరి 19,2024 న గుంటూరు మేత్రాసనంలో చెరసాల పరిచర్య వార్షిక సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో మేధావులు, అనుభవజ్ఞులు, చెరసాల పరిచర్య స్వచ్చంద కార్యకర్తలు, మేత్రాసన గురువులు, మఠకన్యలు పాల్గొన్నారు.

గురుశ్రీ చిన్నాబత్తిని జోసెఫ్ కిరణ్ గారి సారథ్యంలో ఈ సమావేశం జరిగింది. 

ఈ చెరసాల పరిచర్య  సమావేశం "పరిశుద్ధ పోపు గారి 2025 జూబిలీ సంవత్సర సందర్బంగా  మరియు తెలుగు కథోలిక పీఠాధిపతుల సమాఖ్య చెరసాల పరిచర్య విభాగ అధ్యక్షులు కార్డినల్  మహా పూజ్య అంతోని పూల గారి ఆదేశాల మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమన్వయకర్త గురుశ్రీ పసల లహాస్త్రాయ అధ్యక్షతన జరుగుతున్నాయని RVA తెలుగు విభాగానికి తెలియచేసారు.

Tags