క్రీస్తు ప్రేమను చాటుతున్న మహారాణి పేట విచారణ విన్సెంట్ డి పాల్ సభ్యులు

విశాఖ అతిమేత్రాసనం, మహారాణి పేట విచారణ విన్సెంట్ డి పాల్ (Vincent De Paul) సభ్యులు మరో సారి ప్రభు యేసుని ప్రేమని చాటారు.

మహారాణి పేట విచారణ పునీత అంతోని వారి దేవాలయంలో పేదవారికి  క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సందర్భముగా  చీరలు మరియు దుప్పట్లు పంపిణి చేయడం జరిగింది. మహారాణి పేట విచారణ కర్తలు, డియోసెస్ వికార్ జనరల్ గురుశ్రీ డి బాలశౌరి గారి చేతులమీదుగా ఈ కార్యక్రమం జరిగింది. సుమారు 25 మంది పేదవారికి వస్త్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమానికి మహారాణి పేట విచారణ విన్సెంట్ డి పాల్ ప్రెసిడెంట్ శ్రీమతి నిర్మల మేరీ గారు , శ్రీ ప్రకాష్ రావు మాస్టర్ గారు, శ్రీ వేపాడ రాజా రావు గారు, శ్రీ జోజి గారు,   ఇతరులు పాల్గొన్నారు.