ఏలూరు పీఠం-చెరసాల పరిచర్య వార్షిక సమావేశం

భారత చెరసాల పరిచర్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగం ఫిబ్రవరి 21,2024 న ఏలూరు మేత్రాసనంలో చెరసాల పరిచర్య వార్షిక సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో మేధావులు, అనుభవజ్ఞులు, చెరసాల పరిచర్య స్వచ్చంద కార్యకర్తలు, ఏలూరు మేత్రాసన గురువులు, ఏలూరు మేత్రాసన ఛాన్సలర్ గురుశ్రీ బాబు జార్జ్ గారు, ఏలూరు మేత్రాసన సాంఘీక సేవ సంస్థ డైరెక్టర్ గురుశ్రీ ఇమ్మానుయేల్, మేత్రాసన పాస్టరల్ సెంటర్ డైరెక్టర్ గురుశ్రీ చైతన్య రాజు, గురుశ్రీ రాకేష్, ఏలూరు వికార్ ఫోరేన్ గురుశ్రీ ఇంజే పౌల్ గార్లు పాల్గొన్నారు.

ఏలూరు మేత్రాసన చెరసాల పరిచర్య స్వచ్చంద కార్యకర్తలు వారియొక్క స్వీయ అనుభవాలను, మధురానుభూతులను పంచుకొన్నారు.

ఈ చెరసాల పరిచర్య  సమావేశం "పరిశుద్ధ పోపు గారి 2025 జూబిలీ సంవత్సర సందర్బంగా  మరియు తెలుగు కథోలిక పీఠాధిపతుల సమాఖ్య చెరసాల పరిచర్య విభాగ అధ్యక్షులు కార్డినల్  మహా పూజ్య అంతోని పూల గారి ఆదేశాల మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమన్వయకర్త గురుశ్రీ పసల లహాస్త్రాయ అధ్యక్షతన జరుగుతున్నాయని RVA తెలుగు విభాగానికి తెలియచేసారు.