Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
హోలీ రోసరీ కథెడ్రల్ ను సందర్శించిన పాపు గారి రాయబారి
24 జూలై 2022 ఆదివారం నాడు ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ బిషప్స్ కాన్ఫరెన్స్ (FABC) అధ్యక్షులు కార్డినల్ అగ్రపీఠాధిపతులు మహా పూజ్య చార్లెస్ బో గారు మరియు భారతదేశం మరియు నేపాల్కు పాపుగారి రాయబారి ఐన అగ్రపీఠాధిపతులు మహా పూజ్య లియోపోల్డో గెరెల్లి గారు కలకత్తాలోని హోలీ రోసరీ కథెడ్రల్ ను సందర్శించారు.
అగ్రపీఠాధిపతులు మహా పూజ్య లియోపోల్డో గెరెల్లి గారు తాతలు, అమ్మములు, నాయనమ్మలు మరియు వృద్ధుల కోసం రెండవ ప్రపంచ దినోత్సవం సందర్భంగా కథెడ్రల్ లో యూకారిస్టిక్ వేడుకకు అధ్యక్షతను వహించారు. సంవత్సరానికి ఫ్రాన్సిస్ పాపు గారు ప్రతిపాదించిన కీర్తన 92:15,ను “వృద్ధాప్యంలో వారు ఇంకా ఫలిస్తారు" అని ఆయన తెలిపారు.
ఫ్రాన్సిస్ పాపు గారి సందేశాన్ని గుర్తుచేస్తూ,అగ్రపీఠాధిపతులు మహా పూజ్య లియోపోల్డో గెరెల్లి గారు “వృద్ధాప్యం అనేది వదులుకునే సమయం కాదు, శాశ్వతమైన ఫలవంతమైన సమయం; కొత్త పరిచర్య మన కోసం వేచి ఉంది మరియు భవిష్యత్తును చూసేందుకు మమ్మల్ని ప్రోత్సహిస్తుంది అని తెలిపారు."వృద్ధులకు, ఆలోచనలు మరియు ఆప్యాయతలు ఉంటాయి, అవి మనల్ని మనుషులుగా చేస్తాయి", అయినప్పటికీ వారు "సున్నితత్వం యొక్క విప్లవానికి దోహదం చేస్తారు" అని ఆయన తెలిపారు.
సిక్కు మరియు షియా కమ్యూనిటీల సభ్యులతో సహా యునైటెడ్ ఇంటర్ఫెయిత్ ఫోరమ్ ఆఫ్ ఇండియా ఉనికిని మతాంతర వేడుకగా జరుపుకుంటారు. కార్డినల్ చార్లెస్ బో గారు, "భిన్నత్వంలో ఏకత్వాన్ని గౌరవించాలి మరియు ప్రోత్సహించాలని తెలిపారు.
ARTICLE BY
P. PAVAN KUMAR
RVA ONLINE PRODUCER
Add new comment