Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
రైతుల మధ్య దేశభక్తిని ప్రోత్సహించిన HASSS.
75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మన ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు రైతులందరికీ దేశభక్తి స్ఫూర్తిని నింపేందుకు గురుశ్రీ అంతోని గారు 2022 ఆగస్టు 10న జాతీయ జెండాలను పంపిణీ చేశారు.
కారిటాస్ ఇండియా హైదరాబాద్ అతిమేత్రాసన సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉజ్వల 3 అనే కార్యక్రమంలో భాగంగా ఈ జెండా పంపిణీ జరిగింది.
హైదరాబాద్, మహేశ్వరం మండలంలోని దుబ్బచర్ల, లిల్లీపూర్,తాండ మరియు శుభన్పూర్ రైతులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం భూసారాన్ని మెరుగుపరచడానికి, వ్యవసాయ రంగంలో పరివర్తన తీసుకురావడానికి, సేంద్రీయ వ్యవసాయం చేయడానికి రైతులను ప్రేరేపించడం లక్ష్యంగా పెట్టుకుంది.
కార్డినల్ పూల ఆంథోనీ మార్గదర్శకత్వంతో, గురుశ్రీ మాదాను అంతోని గారు " అత్యాధునిక వ్యవసాయ పద్ధతులపై సరైన మార్గదర్శకత్వం లేని రైతులు మరియు వారి జీవితాల్లో వెలుగులు తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము" అని తెలిపారు.
ఈ గ్రామాలలో భూమిని సాగు చేసే రైతులు దాదాపు 500 మంది ఉన్నారు. రైతులకు నిర్వహించిన మొదటి సమావేశానికి దాదాపు 120 మంది రైతులు మరియు HASSS స్వయం సహాయక గ్రూపులకు చెందిన 75 మంది మహిళలు కార్యక్రమానికి హాజరయ్యారు.
"పౌష్టికాహారం ద్వారా మానవునికి జీవం పోసి, జీవనోపాధినిచ్చే దేవుళ్లని, ముఖ్యంగా మానవ జీవితానికి పెను ముప్పుగా పరిణమిస్తున్న ప్రాణాంతక కాన్సర్ నుండి ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని పెంపొందించేది రైతులేనని" ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గురుశ్రీ అంతోని గారు అన్నారు.
గ్రామ సర్పంచ్ స్లీవారెడ్డి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
HASSS గత 50 ఏళ్లుగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలలో ముందంజలో ఉంది.
Add new comment