దివ్యసత్ప్రసాదము, భద్రమైన అభ్యంగనము స్వీకరించిన లూర్దుమాత కథడ్రల్ బాలబాలికలు.

కర్నూలు మేత్రాసనం లూర్దుమాత కథడ్రల్ బాలబాలికలు 5 జూన్ 2022న ఉదయం 8 గంటలకు కర్నూలు అపోస్టోలిక్ అడ్మినిస్ట్రేటర్ గురుశ్రీ ఏ చౌరప్ప గారిచే ప్రధమ దివ్యసత్ప్రసాదము మరియు భద్రమైన అభ్యంగనము స్వీకరించారు.

సుమారు 41 మంది భద్రమైన అభ్యంగము మరియు 13 మందికి పైగా చిన్నారులు నూతనంగా దివ్య సత్ప్రసాదమును స్వీకరించారని విచారణ కర్తలు గురుశ్రీ సిద్ధిపోగుల దేవదాస్ గారు తెలిపారు.
విచారణ గాయక బృందం పవిత్ర గీతాలను ఆలపించారు.

విచారణ కర్తలు గురుశ్రీ దేవదాస్ గారు విచ్చేసిన అడ్మినిస్ట్రేటర్ గారికి, విచారణ సంఘపెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. 

కర్నూలు మేత్రాసనాన్ని ఆ దేవాదిదేవుడు ఎల్లప్పుడు దీవించాలని అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం వారు కోరుకుంటున్నారు.

Add new comment

2 + 3 =