గుణదలమాత నొవీన ప్రార్ధనలు ప్రారంభం

Telagatoti rajaraoగుణదలమాత పుణ్యక్షేత్రం

విజయవాడ మేత్రాసనంలోని గుణదలమాత పుణ్యక్షేత్రం లో గుణదలమాత నొవీన ప్రార్ధనలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 9 , 10 , 11 తారీకులలో గుణదలమాత మహోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జనవరి 31 న గుణదలమాత పుణ్యక్షేత్రంలో నొవీన ప్రార్ధనలు ప్రారంభమయ్యాయి.

విజయవాడ పీఠాధిపతి మహా పూజ్య తెలగతోటి రాజారావు గారు జనవరి 31 సాయంత్రం జరిగిన కార్యక్రమంలో గుణదలమాత పతాకాన్ని ఆవిష్కరించి నొవీన ప్రార్ధనలు ప్రారంభించారు. 

ఈ సందర్భంగా జరిగిన దివ్యబలిపూజలో రాజారావు గారితో కలిసి పలువురు గురువులు పాల్గొన్నారు. విశ్వాసులందరు కలిసి క్రొవ్వొత్తులతో ప్రదక్షిణగా గుణదల కొండ పైకి వెళుతూ జపమాలను జపించారు.

Add new comment

3 + 15 =