Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
నైరుతి రుతుపవనాలు ఆలస్యం
Monday, May 31, 2021
నైరుతు రుతుపవనాలు
ఏడాది నైరుతి రుతు పవనాలు రాక ఆసల్యం కానుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. కర్ణాటక తీరంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రుతుపవనాల రాక ఆలస్యమవుతున్నట్లు ఐఎండీ డైరెక్టర్ జనరల్ ఎం మొహాపాత్ర వెల్లడించారు. జూన్ 3న ఈ రుతుపవానలు కేరళ తీరాన్ని తాకుతాయని పేర్కొంది. నైరుతి రుతు పవనాలు ఒకసారి దేశంలోకి ప్రవేశించాక నాలుగు నెలల పాటు దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు జూన్ 12 నాటికి రుతుపవనాలు వచ్చే అవకాశమున్నట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు.వ్యవసాయ భూములు సగం నైరుతి రుతుపవనాల మీదే ఆధారపడి ఉన్నాయి. ప్రతి సంవత్సరం జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కురిసే వర్షాలే ఈ పంటలకు ఆధారం.
Add new comment