యాంగాన్‌లో క్రైస్తవ సమైక్యత వారోత్సవాల ముగింపు వేడుక

మయన్మార్‌,యాంగాన్‌లోని ఆంగ్లికన్ హోలీ ట్రినిటీ కథడ్రల్‌లో జనవరి 25న సాయంత్రం 5:00 గంటలకు క్రైస్తవ సమైక్యత వారోత్సవాల ముగింపు వేడుకను జరుపుకున్నారు.

యాంగోన్ సహాయక అగ్రపీఠాధిపతులు మహా పూజ్య నోయెల్ సా నవ్ గారు "మంచిని చేపట్టుడు. న్యాయమును జరిపింపుడు" అను అంశంపై మాట్లాడారు. 

" దేశంలోని నగరాలు, వివిధ ప్రదేశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మై కే థీ మిన్ దిన్, బాప్టిస్ట్ పాస్టర్ గారు ఈ కార్యక్రమాన్ని ముగించారు.

వివిధ క్రైస్తవ శాఖలకు చెందిన 200 మంది ఈ ముగింపు వేడుకలలో  పాల్గొన్నారు.

Add new comment

5 + 1 =