Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
ఆధునీకరణ యొక్క హానికరమైన ప్రభావాల నుండి పిల్లలను రక్షిద్దాం
ఆధునికత మరియు వాటి యొక్క హానికరమైన ప్రభావాల నుండి పిల్లలను రక్షించాలని ఇండోనేషియా మహా పూజ్య బిషప్ సిల్వెస్టర్ తుంగ్ కీమ్ సాన్ గారు పిలుపునిచ్చారు.
"కమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పురోగతితో కూడిన ఆధునికరణ మరియు ప్రపంచీకరణ యొక్క దాడి పిల్లలతో సహా మానవాళిపై అనేక హానికరమైన ప్రభావాలను కలిగి ఉందని" ఇండోనేషియా, డెన్పసర్ (బాలీ) పీఠాధిపతులు అన్నారు. అందువల్ల వీటి నుండి యువతను రక్షించడం మన భాద్యత అని అన్నారు.
ఆగస్టు 4-7 తేదీలలో బాలిలో జరిగిన ఇండోనేషియా పోంటిఫికల్ వర్క్ (KKI) , IXవ జాతీయ సమావేశం (పెర్నాస్) ప్రారంభోత్సవంలో అతను సందేశాన్ని అందించాడు.
ఈ సదస్సులో దేశవ్యాప్తంగా ఉన్న 000 మేత్రాసన డైరెక్టర్లు పాల్గొన్నారు.
"అయితే, పిల్లలు జ్ఞానాన్ని వెతకడానికి కమ్యూనికేషన్ టెక్నాలజీలను ఉపయోగిస్తే, అది వారి విద్యకు నిస్సందేహంగా ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి, తల్లిదండ్రులు సోషల్ మీడియాను తెలివిగా ఉపయోగించుకునేలా పర్యవేక్షణ మరియు రోల్ మోడల్స్ ఉండాలి" అని ఆయన నొక్కి చెప్పారు.
ఆధునీకరణ దుష్ప్రభావాల నుండి పిల్లలను రక్షించడమే చర్చి లక్ష్యం అని పీఠాధిపతి నొక్కి వక్కాణించారు.
పొంటిఫికల్ సొసైటీ అఫ్ హోలీ చైల్డ్ హుడ్ 1843లో పిల్లల ఆధ్యాత్మిక మరియు భౌతిక అవసరాలపై పిల్లల దృష్టిని ఆకర్షించే లక్ష్యంతో ఫ్రాన్స్లోని నాన్సీలో స్థాపించబడింది.
"సెకామి వేదికద్వారా, మేము మా యువకులలో నైతిక విలువలను పెంపొందించాలనుకుంటున్నాము. సెకామి ద్వారా, గురువులు మరియు మఠకన్యలు కావడానికి ఒక నిర్దిష్ట పిలుపు ఉంటుందని, అలాగే సెకామి సహచరులను పునరుజ్జీవింపజేయడం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన ఉంటుందని మేము ఆశిస్తున్నాము, "పీఠాధిపతులు చెప్పారు.
ప్రపంచీకరణ మరియు ఆధునికత నుండి పిల్లల హృదయాలను విముక్తి చేయాలని బిషప్ సెకామిస్ డైరెక్టర్లను కోరారు.
Add new comment